జన గణనకు అందరూ సహకరించాలి
May 13, 2026
dharshininews
జన గణనకు అందరూ సహకరించాలి
- రాజీవ్ కాలనిలో డప్పుతో చాటింపు
- కౌన్సిలర్ జావిద్ అవగాహన
తాండూరు, దర్శిని ప్రతినిధి : ప్రభుత్వాలు చేపడుతున్న జనగణనకు అందరూ సహకరించాలని తాండూరు మున్సిపల్ రాజీవ్ కాలనీ కౌన్సిలర్ జావీద్ సూచించారు.
మంగళవారం రాత్రి కాలనీలో డప్పు చాటింపు వేసి జనగణనపై అవగాహన కల్పించారు. 2027 జన గణన సందర్భంగా అధికారులు, ఎన్యూమరేటర్లు ఇంటింటికి వస్తారని చెప్పారు. అధికారులు అడిగిన వివరాలను క్షుణ్ణంగా తెలియజేయాలని అన్నారు.
అధికారులు చేపడుతున్న జన గణనకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. అదేవిధంగా ఓటర్ల మ్యాపింగ్ కు సంబంధించి వార్డులోని డ్వాక్రాభవనంలో ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.
ఇంకా ఓటర్ల మ్యాపింగ్ చేసుకోలేని వారు ఈ క్యాంపులో వివరాలు అందించి నమోదు చేసుకోవాలని సూచించారు. జన గణనతో పాటు ఓటర్ల మ్యాపింగ్ పై వాడు మొత్తం తిరిగి కౌన్సిలర్ జావిద్ అవగాహన కల్పించారు.
https://www.dharshininews.com/43291/
మంగళవారం రాత్రి కాలనీలో డప్పు చాటింపు వేసి జనగణనపై అవగాహన కల్పించారు. 2027 జన గణన సందర్భంగా అధికారులు, ఎన్యూమరేటర్లు ఇంటింటికి వస్తారని చెప్పారు. అధికారులు అడిగిన వివరాలను క్షుణ్ణంగా తెలియజేయాలని అన్నారు.
అధికారులు చేపడుతున్న జన గణనకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. అదేవిధంగా ఓటర్ల మ్యాపింగ్ కు సంబంధించి వార్డులోని డ్వాక్రాభవనంలో ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.
ఇంకా ఓటర్ల మ్యాపింగ్ చేసుకోలేని వారు ఈ క్యాంపులో వివరాలు అందించి నమోదు చేసుకోవాలని సూచించారు. జన గణనతో పాటు ఓటర్ల మ్యాపింగ్ పై వాడు మొత్తం తిరిగి కౌన్సిలర్ జావిద్ అవగాహన కల్పించారు.
https://www.dharshininews.com/43291/