schedule Thursday, September 03, 2026

జిల్లాలో పెరిగిన క్రైం రేట్..!

calendar_today December 24, 2025
person dharshininews
జిల్లాలో పెరిగిన క్రైం రేట్..!
జిల్లాలో పెరిగిన క్రైం రేట్..! - వార్షిక నేర నివేధిక విడుదల - వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ స్పేహా మెహ్రా వికారాబాద్, దర్శిని ప్రతినిధి : వికారాబాద్‌ జిల్లాలో ఈ యేడాది నేరాల నమోదు స్వల్పంగా పెరిగినట్లు జిల్లా ఎస్పీ స్నేహా మెహ్రా వెల్లడించారు. మంగళవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ స్నేహా మెహ్రా జిల్లాలోని అన్ని డివిజన్‌ల డిఎస్పీలతో కలిసి వార్షిక నేర నివేధికను ప్రకటించారు. గత యేడాది 2024తో పోలిస్టే ఈయేడాది 2025 డిసెంబర్ నాటికి క్రైం రేట్ స్వల్పంగా పెరిగిందని చెప్పారు. గత యేడాది నవంబర్ నాటికి 3691 కేసులు నమోదైతే ఈసారి 3813 కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఈ లెక్కన ఈయేడాది 3.31శాతం నేరాలు పెరిగాయన్నారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో నేరాల నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. శాంతిభదత్రలను పరిరక్షించడంతో పాటు మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను తగ్గించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా ముగియడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. క్రిస్మస్ పండగతో పాటు న్యూఇయర్ సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. కేసుల వివరాలు ఇలా   ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/40185/