schedule Saturday, September 05, 2026

మానవ రూపంలో వినాయకుడు

calendar_today September 17, 2023
person dharshininews
మానవ రూపంలో వినాయకుడు
మానవ రూపంలో వినాయకుడు - ప్రపంచంలోనే ఏకైక దేవాలయంలో పూజలు - ఆ దేవాలయం గురించి ఆసక్తికర విషయాలు దర్శిని డెస్క్‌: వినాయకుడు అంటే ఏనుగు రూపంలో దర్శనమే గుర్తుకొస్తుంది. ఆయనకే మనం పూజలు నిర్వహిస్తుంటాం. మానవ రూపంలో దర్శనమిచ్చే వినాయకుడు గురించి చాలా మందికి తెలియదు. మానవ రూపంలో ఉన్న ఈ వినాయకుడికి ప్రపంచంలోనే ఉన్న ఏకైక దేవాలయం అది. ఇక్కడ తప్ప మరెక్కడా నరుని రూపంలో ఉన్న వినాయకున్ని దర్శించుకోలేరు. చదవండి మరి ఈ ఆలయం ఎక్కడ ఉందో.. ఆ గణేషుని వివరాల్లేంటో తెలుసుకునేందుకు. భారతదేశంలో తమిళనాడులో ఈ వినాయకుడి ఆలయం ఉంది. తమిళనాడు రాష్ట్రంలోని తిరువారూర్ జిల్లాలో కుట్నూర్ నుండి 3 కి.మీ దూరంలో తిల్లతర్పన్ పురి అనే ప్రదేశంలో ఉంది. విమానం ద్వారా ఈ ఆలయానికి చేరుకోవచ్చు. ఆలయానికి సమీపాన తిరుచిరాపల్లి విమానాశ్రయం ఉంది. ఇది సుమారు 110 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయంలో స్వామివారిని ఆదివినాయకుడుగా పిలుస్తారు. ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా ఇక్కడ గణేశుడు మానవ రూపంలో పూజించబడుతున్నాడు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈ ఆలయంలో గణపతి విగ్రహం శరీరం.. మానవ ముఖంతో ఉంటుంది. ఇలా ఎందకు ఉంటుందంటే.. పార్వతి దీవి కోసం ఇంట్లోకి వెళ్ళబోతున్న శివయ్యను గణేశుడు అడ్డుకున్నాడు. దీంతో శివుడి కోపం వచ్చి తన త్రిశూలంతో గణేశుడి తలను తన శరీరం నుండి వేరు చేసి ఆ తలను భస్మం చేసినట్లు పురాణాలు చెబుతున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత పార్వతి దేవి కోరికపై గణేశుడిని బతికించడం కోసం గణేశుడి మొండెంపై ఏనుగు తలను ఉంచి జీవం పోశారు. అప్పటి నుంచి వినాయకుడిని గజానుడి రూపంలో పూజిస్తున్నారు. అయితే ఈ ఆలయంలో మాత్రం గణపతిని ఆది అంటే గణపతి మొదటి రూపాన్ని పూజిస్తారు.   ఇది కూడా చదవండి.. https://dharshininews.com/20328/