schedule Sunday, July 05, 2026

గోవులను తరలిస్తే చర్యలు

calendar_today June 25, 2023
person dharshininews
గోవులను తరలిస్తే చర్యలు
గోవులను తరలిస్తే చర్యలు - జిల్లాలో 10 చెక్‌ పోస్టుల ఏర్పాటు - ప్రతి వాహనంపై తనిఖీలు - జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి ఐపీఎస్ వికారాబాద్, దర్శిని ప్రతినిధి: జిల్లాలో గోవుల అక్రమ రవాణా నియంత్రణకు ప్రత్యేక నిఘా ఉంచడం జరిగిందని, మూగజీవాల అక్రమ రవానాకు పాల్పడితే చర్యలు తప్పవని వికారాబాద్‌ జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి ఐపీఎస్ తెలిపారు. బక్రీద్ పండుగ సందర్బంగా ఆవులను, లేగదుడాలను తరలించడం చట్టా ప్రకారం విరుద్ధమన్నారు. జిల్లాలో అక్రమ రవాణాను నియంత్రించేందుకు సంబంధిత అధికారులతో, పోలీస్ అధికారుతో సమన్వయంతో చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. జిల్లాలో ఎవ్వరు కూడా ఆవులను, లేగదూడలను తరలించవద్దన్నారు. ఒక వేళ తరలిస్తూ పట్టుబడితే కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. అదేవిధంగా అక్రమ రవాణా అరికట్టడంలో భాగాగా జిల్లాలో నాకాబంది, వాహనాల తనిఖీ నిర్వహించడం జరుగుతుందన్నారు. దీంతో పాటు జిల్లాలోని అలంపల్లి X రోడ్, ధారూర్ X రోడ్, మోమిన్ పేట్ X రోడ్, తాండూరు మండలం అంతారం గేట్, కొత్లాపూర్, బషీరాబాద్‌ మండలం ఇందర్‌ చేడ్, యాలాల మండలం లక్ష్మినారాయణపూర్ X రోడ్, రాఘవాపూర్, కోడంగల్‌ అంగడి చిట్టాంపల్లి, రావులపల్లిలో మొత్తం 10 చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ చెక్ పోస్టుల వద్ద నిరంతరం అక్రమ రవాణా పైన తనిఖీలు చెయడం జరుగుతుంది పేర్కొన్నారు. ఒకవేళ ఎవరైనా తరలిస్తున్నట్లు అనుమానం కలిగిగే తమ పరిధిలోని అధికారులకు లేదా డైల్ 100కు ఫోన్‌ చేసి సమాచారం అందించాలని సూచించారు. ఇదికూడా చదవండి... https://dharshininews.com/18104 chaithany collage