schedule Friday, September 04, 2026

విద్యార్థుల ఆచూకీ లభ్యం

calendar_today November 19, 2025
person dharshininews
విద్యార్థుల ఆచూకీ లభ్యం
విద్యార్థుల ఆచూకీ లభ్యం - సీసీ కెమెరాల ద్వారా గుర్తింపు - ఎక్కడ దొరికారంటే...? పెద్దేముల్, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం ఎన్టీఆర్ నగర్‌లోని గురుకుల పాఠశాల నుంచి అదృశ్యమైన విద్యార్థుల ఆచూకి లభించింది. సీసీ కెమెరాల ద్వారా వారి ఆచూకిని గుర్తించారు. వికారాబాద్ జిల్లా కోట్ పల్లి మండలం మోత్కుపల్లికి చెందిన వినయ్ కుమార్ గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. అదే గ్రామానికి చెందిన హర్షవర్ధన్ 9వ తరగతి చదువుతున్నాడు. అయితే బుధవారం ఉదయం వినయ్, హర్షవర్ధన్ లు పాఠశాల నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. దీంతో విద్యార్థులు అదృశ్యమైనట్లు తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అందరు విద్యార్థులపై నిఘా ఉంచారు. మోమిన్ పేట్‌లో ఉన్నట్లు గుర్తించారు. సీసీ కెమెరాలో గుర్తించారు. దీంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/39726/