schedule Saturday, July 04, 2026

రైతులకు బంపర్‌ ఆఫర్..!

calendar_today June 12, 2025
person dharshininews
రైతులకు బంపర్‌ ఆఫర్..!
రైతులకు బంపర్‌ ఆఫర్..! - 4శాతం వడ్డీతో రూ. 3లక్షల దాకా రుణాలు - విత్తనాలు, ఎరువుల కొనుగోలుకు ఉపయోగం - మత్య్సకారులు, పాడి రైతులకు ప్రయోజనం దర్శిని డెస్క్ : దేశంలోని నిరుపేదలతో పాటు రైతుల కోసం మోడీ సర్కారు ఎన్నో పథకాలను అమలు చేస్తోంది. అందులో ఉన్న ఓ పథకం వ్యవసాయ రంగంలో ఉన్న రైతులకు వరంగా మారింది. ఈ పథకం రైతులకు బంపర్ ఆఫర్ అని చెప్పొచ్చు. కేవలం 4శాతం వడ్డీతో రైతులకు రూ. 3లక్షల వరకు రుణాలు పొందే అవకాశాన్ని కల్పిస్తోంది. రైతులకు సులభంగా రుణాలను అందించడం, పర్యావరణ అనుకూల వ్యవసాయ పద్ధతుల్లో పెట్టుబడి పెట్టడానికి వీలు కల్పించడం లక్ష్యంగా కిసాన్‌ క్రెడిట్ కార్డు(కేసీసీ) స్కీంను అమలు చేస్తోంది. కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా రైతులకు కావాల్సిన విత్తనాలు, ఎరువులు మరియు పరికరాలను కొనుగోలు చేయడానికి ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారు. దేశంలోని లక్షలాది మంది రైతులకు ఆర్థిక జీవనాధారంగా మారింది. క్రెడిట్ కార్డుల ద్వారా స్వల్పకాలిక పంట రుణాలు ఇప్పుడు సులభతరం అయ్యాయి. కెసిసి ద్వారా, వ్యవసాయ కార్యకలాపాలకు వారి ఆర్థిక అవసరాలను తీర్చడానికి కేంద్ర ప్రభుత్వం రైతులకు రుణ రూపంలో రూ.5 లక్షల వరకు సహాయం చేస్తుంది. విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు వంటి ముఖ్యమైన వస్తువులను కొనుగోలు చేయడంలో, పంట ఉత్పత్తికి సంబంధించిన నగదు అవసరాలను తీర్చడంలో కెసిసి పథకం రైతులకు గొప్ప సౌలభ్యాన్ని అందిస్తోంది. రైతు సకాలంలో చెల్లిస్తే, రూ.3 లక్షల వరకు రుణంపై 4 శాతం వడ్డీ మాత్రమే చెల్లించాలి. దీనితో పాటు, రుణాన్ని సకాలంలో తిరిగి చెల్లించినందుకు 3 శాతం అదనపు సత్వర చెల్లింపు ప్రోత్సాహకం (PRI) కూడా అందిస్తుంది. దీని కారణంగా రైతులు ప్రతి లక్ష రూపాయలపై ప్రతి సంవత్సరం దాదాపు రూ.9,000 వడ్డీని ఆదా చేయవచ్చు. ఇదిలా ఉండగా, ప్రభుత్వం ఇప్పుడు ఈ సబ్సిడీ రుణ పరిమితిని రూ.3 లక్షల నుండి రూ.5 లక్షలకు పెంచింది. దీని వలన రైతులకు మాత్రమే కాకుండా మత్స్యకారులు, పాడి రైతులకు కూడా ప్రయోజనం చేకూరింది. ఇప్పటివరకు 7.7 కోట్లకు పైగా రైతులు ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందినట్లు కేంద్రం తెలిపింది. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/36097/