schedule Saturday, September 12, 2026

రెండో పెళ్లికోసం భార్యను హత్య చేసిన భర్త

calendar_today December 5, 2023
person dharshininews
రెండో పెళ్లికోసం భార్యను హత్య చేసిన భర్త
రెండో పెళ్లికోసం భార్యను హత్య చేసిన భర్త - తాండూరు పోలీస్టేషన్‌లో కేసు నమోదు - వివరాలు వెల్లడించిన పట్టణ సీఐ రాజేందర్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : రెండో పెళ్లి కోసం భార్యతో గొడవ పెట్టుకుని ఆమెను హత్య చేశాడు ఓ భర్త. ఈ సంఘటన తాండూరు పట్టణంలో చోటు చె సుకుంది. పట్టణ సీఐ రాజేందర్ రెడ్డి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తాండూరు పట్టణం సీతారాంపేట్ కు చెందిన మింగనిగాని శ్రీనివాస్ చిన్న చెల్లెలు అనసూయను 12 ఏండ్ల క్రితం అదే కాలనీకి చెందిన మ్యాతరి శాంతుకుమార్ కు ఇచ్చి వివాహాము జరిపించారు. వీరికి నలుగురు మగ పిల్లలు పుట్టి చనిపోయారు. ఆ తరువాత శాంతుకుమార్ మద్యానికి బానిసై భార్య అనసూయతో గోడపడేవాడు. రెండో పెండ్లి విషయంలో కూడా ఇద్దరి మద్య ఘర్షణలు జరుగుతున్నాయి. సోమవారం రాత్రి మద్యం మత్తులో శాంతుకుమార్ అనసూయతో మళ్లీ గొడవకు దిగాడు. ఈ క్రమంలో శాంతు కమార్ భార్యను ఇష్టం వచ్చినట్లు దాడి చేశాడు. దీంతో అనసూయ ఎదపై, కడుపుపై గాయాలు అయ్యాయి. అక్కడితో ఆగకుండా శాంతుకుమార్ ఆమెను గొంతు నులుమడంతో అనసూయ మృతి చెందినట్లు మృతిరాలి అన్న శ్రీనివాస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈమేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు పట్టణ సీఐ రాజేందర్ రెడ్డి తెలిపారు. ఇది కూడా చదవండి... https://dharshininews.com/22417/